E-Paper
Advertisement

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లాలో ప్రమాదం

Advertisement

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో కారు.. చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఛిద్రమైపోయారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిద్ధిపేట జిల్లాలో ప్రమాదం..

Advertisement

మరోవైపు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బైపాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారథాన్‌ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ బైక్‌పై బయలుదేరారని, గజ్వేల్‌ బైపాస్‌ రోడ్డులోకి రాగానే ప్రమాదం జరిగిందని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు రాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్ పరంధాములు, మరొకరు దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×