BigTV English

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పల్నాడు జిల్లాలో ప్రమాదం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో కారు.. చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఛిద్రమైపోయారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సిద్ధిపేట జిల్లాలో ప్రమాదం..

మరోవైపు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బైపాస్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారథాన్‌ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ఇద్దరూ బైక్‌పై బయలుదేరారని, గజ్వేల్‌ బైపాస్‌ రోడ్డులోకి రాగానే ప్రమాదం జరిగిందని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు రాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్ పరంధాములు, మరొకరు దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×