E-Paper
Advertisement

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?

Breaking News: తమ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆ యువకులు. కానీ ప్లెక్సీలు కడుతుండగా, దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకై, ప్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29) పలువురు యువకులు నిమగ్నమయ్యారు.

అయితే ఈ నలుగురు ప్లెక్సీని కట్టే క్రమంలో ప్రక్కనే గల విద్యుత్ తీగలు తగిలి నలుగురు యువకులు షాక్ కు గురయ్యారు. స్థానికులు వీరిని రక్షించేలోగానే వీరు అక్కడే కన్నుమూశారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా, తణుకు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివాదం నుండి విషాదం వరకు..

తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షలు కూడా తలెత్తాయి. చివరికి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో సమస్య పరిష్కారమైంది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధన కు ఏర్పాట్లు చేస్తుండగా, దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది.

4 రోజుల క్రితం ఇక్కడే ఇద్దరు మృతి..

ఇదే ఉండ్రాజవరం మండలంలో నాలుగు రోజుల క్రితం క్రాకర్స్ తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు సజీవ దహనమైన విషయం తెలిసిందే. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇదే మండలంలో ఇద్దరు, నేడు ప్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందారు.

విద్యుత్ షాక్ తో తమ పిల్లలు మృత్యువు బారిన పడగా, ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో తాడిపర్రు గ్రామంలో ఎటు చూసినా రోదనలే వినిపిస్తున్నాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×