BigTV English
Advertisement

AP Assembly Sessions 2024 : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా ?

AP Assembly Sessions 2024 : నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తారా ?

AP Assembly Session updates(AP news live): నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేటితో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్‌హమీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుపడుతూ తెలుగు తమ్ముళ్ల వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది.


స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు సహకరించాలని స్పీకర్‌ చెబుతున్నా పట్టించుకోని తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు.

Read More : AP Assembly Sessions 2024 : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. ఏపీ అసెంబ్లీ వాయిదా


దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. అయితే.. సభ నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో మార్షల్స్‌ రంగంలోకి దిగి వారిని బలవంతంగా బయటకు పంపారు.

ఇక టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. దీంతో శాసనసభా సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఆందోళనకు సభ వేదికైందని.. ప్రజలకు పనికొచ్చే చర్చలు జరగకుండా ఈ రాజకీయ గందరగోళమేంటని ఆరోపిస్తున్నారు. ఇవాళ చివరిరోజైనా సభ సజావుగా జరగుతుందా..? టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమిస్తారా ? లేదంటే షరా మామూలే అన్నట్టు వైసీపీ, టీడీపీ నేతల మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×