BigTV English
Advertisement

AP Govt: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ. 10 వేలు, రూ. 5 వేలు అందించేందుకు రెడీ!

AP Govt: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ. 10 వేలు, రూ. 5 వేలు అందించేందుకు రెడీ!

AP Govt: ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపుల్లో ఉన్న వారి కల నెరవేరింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే వారి ఖాతాల్లో నగదు కూడా జమ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో, వారి ఆశలు చిగురించాయని చెప్పవచ్చు.


కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్క హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. తాజాగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేందుకు మంత్రి మండలి ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. రహదారుల అభివృద్ది, ధాన్యం అమ్మిన వెంటనే నగదు జమ, వరద సాయం, డీఎస్సీ నోటిఫికేషన్, ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.

అలాగే దేవాలయాల ధూపదీప నైవైద్యాల కోసం ఎదురుచూపుల్లో ఉన్న అర్చకులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. ఆదాయం లేకుండా ఉన్న చిన్న ఆల‌యాల‌కు ధూప‌ దీప‌ నైవేద్యాల కోసం అందించే ప్రభుత్వ సాయాన్ని ఏకంగా ప్రభుత్వం రెట్టింపు చేసింది. నెల‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. రూ.7,000 అర్చకుడికి, రూ.3,000 ధూప‌, దీప‌, నైవేద్యానికి వినియోగించాలని ప్రభుత్వం ప్రకటించింది.


Also Read: Viral News: కారు వెంటపడ్డ గోమాత.. అస్సలు కదలనివ్వలేదు

తాజాగా మసీదులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మసీదుల్లో ఇమామ్ లుగా కొనసాగుతున్న వారికి రూ.10,000, మౌజన్‌కు రూ.5,000 గౌరవ వేతనం చెల్లించేందుకు ఉత్తర్వులను సీఎం చంద్రబాబు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రకటనపై మైనారిటీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో అర్చకులు, ఇమామ్ లు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. ఆ సమస్యలను అధికారంలోకి రాగానే తీర్చేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి రాగానే ఆ హామీలను కూడా నెరవేర్చడంతో అర్చకులు, ఇమామ్, మౌజన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×