E-Paper
Advertisement

AP DSC Syllabus: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ అప్ డేట్.. సిలబస్ చూసుకున్నారా.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

AP DSC Syllabus: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ అప్ డేట్.. సిలబస్ చూసుకున్నారా.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
Advertisement

AP DSC Syllabus: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. ఎప్పటికే డీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టారా.. అయితే మీలాంటి అభ్యర్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అది కూడా డీఎస్సీ అభ్యర్థులకు సూపర్ అప్ డేట్ అని చెప్పవచ్చు.

ఏపీలో కూటమి ప్రభుత్వం విజయాన్ని అందుకున్న వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనితో నోటిఫికేషన్ గురించి ఎదురు చూపుల్లో ఉన్న అభ్యర్థులు ఆనందపడ్డారు. అయితే ప్రభుత్వం ఏర్పడడడం, వరదలు రావడంతో నోటిఫికేషన్ కు సంబంధించిన వ్యవహారం కాస్త ఆలస్యమైంది. దీనితో అసలు ప్రభుత్వం ప్రకటన ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపుల్లో ఉన్న పరిస్థితి అభ్యర్థులది. ఓ వైపు విద్యా శాఖ మంత్రిగా గల నారా లోకేష్ పలు మార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు.

Advertisement

ఈ తరుణంలో అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. కోచింగ్ సెంటర్లకు వేలకొద్ది ఫీజులు చెల్లించి, ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. దీనితో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని, ఇక పుస్తకాల కుస్తీలో మరింత స్పీడ్ పెంచారు.

Also Read: Rajya Sabha: జనసేన 1, టీడీపీ 2.. రాజ్యసభకి వెళ్లేది వీళ్లే..?

Advertisement

కాగా మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబస్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. అది కూడా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయగా, నోటిఫికేషన్ కూడా అతి త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ సిలబస్ కోసం అభ్యర్థులు http://apdsc2024.apcfss.in వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు, అన్ని వివరాలు ప్రభుత్వం అందులో పొందుపరిచింది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరి మీరు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నారా.. అయితే ఆలస్యం చేయవద్దు.. సిలబస్ చెక్ చేసుకోండి.. ప్రిపేర్ కండి.. జాబ్ ఇలా పట్టేసేయండి.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×