BigTV English
Advertisement

APPSC Group -II : రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్పీ గ్రూప్ -II అభ్యర్థులు – ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఇవే..

APPSC Group -II : రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్పీ గ్రూప్ -II అభ్యర్థులు – ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఇవే..

APPSC Group -II : మరికొన్ని గంటల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2  మెయిన్స్ పరీక్షలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని అనేక ప్రాంతాల్లో గ్రూప్ -2 అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చిన యువతీ, యువకులు ప్రభుత్వానికి, ఏపీపీఎస్పీ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. పరీక్షల నిర్వహణలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్ది పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనలతో అనేక చోట్ల రహదారులు స్థంభించిపోయాయి. 0


రాత్రి వేళల్లో కూడా యువతీ, యువకులు రోడ్ల మీదకు వచ్చి తమకు న్యాయం చేయాలి అంటూ పెద్దగా నినాదు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లను దిగ్బంధించారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ఇలాగా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అయినా.. ప్రభుత్వం తమ అభ్యర్థనను పట్టించుకోవడం లేదని, పరీక్షల నిర్వహణలో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తప్పుడు విధానాన్ని అవలంబిస్తే సమర్థులు నష్టపోవాల్సి వస్తుందని, ఏళ్లుగా పడుతున్న కష్టం అంతా వృథా అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 పరీక్ష ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాయిదా పడుతుందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. దాంతో.. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. చివరి నిముషం వరకు పరీక్షలు వాయిదా పడతాయని ఆశించగా,  నిరాశ ఎదురవ్వడం,  పరీక్షల్లో అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. నిరసనలను తీవ్ర తరం చేశారు.


ప్రస్తుత విధానంలో అనుసరిస్తున్నట్లుగా హారిజెంటల్ రిజర్వేషన్ ను పక్కనపెట్టాలని, వర్టికల్ రిజర్వేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. అలాగే జీవో నెంబర్ 77ను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ మూర్ఖంగా ప్రవర్తిస్తుందని, అభ్యర్థులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రోస్టర్ విధానాన్ని ఎందుకు సవరించడం లేదంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తే వాటి ఫలితాలు వచ్చే సమయానికి కచ్చితంగా పరీక్షల ఫలితాలను కోర్టును నిలిపివేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే రోస్టర్ విధానాల్లో తప్పులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వెయ్కికి పైగా కేసులు నమోదు అయ్యాయని తెలుపుతున్నారు. నోటిఫికేషన్లు రద్దు అయితే అభ్యర్థులకు ఎప్పటికీ న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

Also Read : AP Inter Exams 2025: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

గత 20 రోజులుగా శాంతియుతంగానే ధర్నాలు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుకుంటున్నారు అంటూ అగ్రహిస్తున్నారు. తొలుత ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు పంపించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ అందుకు అంగీకరించడం లేదంటూ చెప్పటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×