E-Paper
Advertisement

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ హాస్టల్.. స్పై కెమెరాలు.. కొత్త ట్విస్ట్‌, వణుకుతున్న ఆ ఇద్దరు

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ హాస్టల్.. స్పై కెమెరాలు.. కొత్త ట్విస్ట్‌, వణుకుతున్న ఆ ఇద్దరు
Advertisement

Gudlavalleru: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి వెళ్లిపోతుంది.. ఈ క్యాప్షన్ ప్రస్తుత రాజకీయాలకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు తప్పుడు ప్రచారంతో మొదలవుతున్నాయి. ఆ విషయం సరే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఎలాంటి స్పై కెమెరాలు లేవని తేల్చి చెప్పారు పోలీసులు. కాకపోతే కొంతమందికి టెన్షన్ పట్టుకుంది. ఇంతకీ వారెవరు? అన్నదే అసలు పాయింట్.

ఏపీలో విజయవాడ వరద సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పోలీసుల దృష్టి కేసులపై పడింది. తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారం ఏపీకి ఓ కుదుపు కుదిపేసింది. అందరి కంటే ముందు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై ఒంటికాలిపై లేచారు. అవన్నీ పుకార్లేనని తేలిపోయినట్టు తెలుస్తోంది. స్నానపు గదుల్లో ఎలాంటి స్పై కెమెరాలు లేవన్నది పోలీసుల వెర్షన్. చాలామందిని విచారించామని, వాటిని ప్రత్యక్షంగా చూసినట్టు ఏ ఒక్కరూ చెప్పలేదు. మాకు వాళ్ల ద్వారా తెలిసిందని మాత్రమే చెబుతున్నారని వివరించారు.

Advertisement

ALSO READ: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్ వ్యవహారంలో అదిగో పులి అంటే.. ఇదిగో మేక అన్నతరహాగా మారింది. హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినుల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ ఆగష్టు 29న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 300 వీడియోలు షేర్ చేశారని చెప్పడంతో విద్యార్థుల పేరెంట్స్ హడలిపోయారు.

Advertisement

స్పై కెమెరాల వ్యవహారాన్ని చంద్రబాబు సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం చొరవతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, పూణెకు చెందిన సీ-డాక్ సాంకేతిక నిఫుణులు రంగంలోకి దిగారు. ఒక క్రిమినల్ కేసులో సీఈఆర్టీ పని చేయడం ఏపీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. కేంద్ర సర్వర్లు, స్టూడెంట్స్ హాస్టల్స్, విద్యార్థుల సెల్‌‌ఫోన్లు, ల్యాప్ టాప్‌లను పరిశీలించారు. మూడు రోజులపాటు దర్యాప్తు చేశారు. అనుమానం ఉన్న 14 మొబైల్, 6 ల్యాప్ టాప్‌లను ల్యాబ్‌కు పంపారు. వచ్చేవారానికి నివేదిక రానుంది.

మరో ఐదురోజుల తర్వాత గుడ్లవల్లేరు హాస్టల్ వ్యవహారం గుట్టు బయటపడనుంది. ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులపై అనుమానాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో చదువుతున్న ఓ అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమించుకున్నారట. వారిద్దరి ఫ్యామిలీలు ఒకే పొలిటికల్ పార్టీలో ఉన్నారని సమాచారం. దీంతో వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు ఫ్రెండ్స్ ద్వారా షేర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.  చివరకు ఈ విధంగా దుమారం రేగిందని అంటున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు లోపల ఎలాంటి కెమెరాలు లేవన్నది కొందరు స్టూడెంట్స్ ఓపెన్‌గా చెబుతున్నారు.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ హాస్టల్‌ను మంత్రులు పలుమార్లు పర్యటించారు. గుడ్లవల్లేరు వ్యవహారం నేపథ్యంలో అధికార టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోసింది వైసీపీ. కెమెరాలు లేవని రిపోర్టు గనుక వస్తే.. దాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అస్త్రాలను వైసీపీ సిద్ధం చేస్తోందని సమాచారం.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×