E-Paper
Advertisement

Pemmmasani Chandrasekhar: ఇప్పుడు ఎందుకు వచ్చారు..? మంత్రి పెమ్మసానిని పట్టుకుని నిలదీస్తూ..!

Pemmmasani Chandrasekhar: ఇప్పుడు ఎందుకు వచ్చారు..? మంత్రి పెమ్మసానిని పట్టుకుని నిలదీస్తూ..!
Advertisement

Pemmmasani Chandrasekhar: గుంటూరు జిల్లా మందడంలో N-8 రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులు నిన్న ఒక సమావేశం నిర్వహించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ..  తీవ్ర మనస్తాపానికి గురైన రామారావు అనే వ్యక్తి అక్కడికక్కడే గుండెపోటుతో మరణించారు. అభివృద్ధి పేరుతో తమ ఉపాధిని, నివాసాలను దూరం చేస్తున్నారనే ఆందోళన ఆయన ప్రాణం తీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

రామారావు మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. అయితే..  అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు, మేము రోడ్డున పడుతున్నప్పుడు నోరు విప్పని మీరు, ఇప్పుడు ప్రాణం పోయాక నివాళులర్పించడానికి ఎందుకు వచ్చారు?’ అంటూ నిలదీశారు. ‘పోయిన మనిషిని తిరిగి తీసుకురాగలరా? మీ సానుభూతి మాకు అక్కర్లేదు’ అని తెగేసి చెప్పడంతో..  మాట్లాడకుండానే ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Advertisement

అనంతరం మంత్రి నారాయణ మందడం చేరుకుని రామారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ద్వారా రామారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ కూడా కుటుంబానికి భరోసా కల్పిస్తూ..  నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు.

Advertisement

ALSO READ: Vijayawada Kanaka Durga: RS.3 కోట్ల బకాయిలు.. కీలాద్రికి కరెంట్ కట్

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×