E-Paper
Advertisement

Vijayawada Kanaka Durga: RS.3 కోట్ల బకాయిలు.. కీలాద్రికి కరెంట్ కట్

Vijayawada Kanaka Durga: RS.3 కోట్ల బకాయిలు.. కీలాద్రికి కరెంట్ కట్
Advertisement

Vijayawada Kanaka Durga: విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసింది APCPDCL. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటంతో..  ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ విద్యుత్ పంపిణీ సంస్థ (APCPDCL) కఠిన నిర్ణయం తీసుకుంది.

దుర్గగుడి యాజమాన్యం 2023 ఫిబ్రవరి నెల నుండి విద్యుత్ బిల్లులను సక్రమంగా చెల్లించడం లేదు. గత రెండేళ్లుగా ఈ బకాయిలు పేరుకుపోతూ దాదాపు 3.20 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ..  ఆలయ అధికారులు సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. గడువు ముగిసినా స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేసినట్లు APCPDCL స్పష్టం చేసింది.

Advertisement

హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయినప్పటికీ, లిఫ్టులు, ఏసీలు, ఇతర సేవలపై స్వల్ప ప్రభావం పడటంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆలయ ఈఓ సహా ఇతర ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.

విద్యుత్ కట్ చేసిన వెంటనే దుర్గగుడి అధికారులు APCPDCL ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం ఉన్న సమస్యను వివరించారు. భక్తుల రద్దీని, ఆలయ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ శాఖ అధికారులు మానవతా దృక్పథంతో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ఆలయ అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఇంతటి భారీ ఆదాయం ఉన్న దేవస్థానంలో విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ: Sangareddy Crime: కోతులను తప్పించబోయి చెరువులో పడ్డ ఆటో.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×