E-Paper
Advertisement

Viveka Murder Case : అవినాష్ రెడ్డికి ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Viveka Murder Case : అవినాష్ రెడ్డికి ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement

Viveka Murder Case Updates : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తుదిపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్ ను ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తున్నారా అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించగా..అవునని సిద్ధార్థ లూథ్రా సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వివరణతో కూడిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. తాము దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం విచారణకు స్వీకరించాలని కోరారు. లేదంటే ఆ పిటిషన్ వృథా అవుతుందన్నారు. దీంతో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ పిటిషన్ ను శుక్రవారం లిస్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ పై విచారణ జరిగింది.

Advertisement

అవినాష్‌రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల దర్యాప్తు ప్రక్రియ దారి తప్పే ప్రమాదం ఉందని సునీతా రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 30లోపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. దీంతో కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోందని.. ఇంత కీలకదశలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల దర్యాప్తు దారితప్పే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పిటిషన్లు సాధారణంగా జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ముందు విచారణకు వచ్చేవి. శుక్రవారం ఆ ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు లిస్ట్‌ చేశారు.

మరోవైపు మూడో రోజూ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా మూడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×