BigTV English
Advertisement

Heavy Rains: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం

Heavy Rains: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం

Another Low-pressure Area in Bay Of Bengal: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడం వాయిగండంగా మారి విజయవాడను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇంకా తేరుకోకముందే మళ్లీ మరో అల్ప పీడనం ఏర్పడనుంది. బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అల్పపీడనంగా మారనుంది వాతావరణ శాఖ హెచ్చరించింది.


రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతువపన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈనెల 9 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ ప్రభావంతో విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఇప్పటికే కురిసిన వర్షాలకు అల్లాడిపోతున్న విజయవాడను వర్షం వీడట్లేదు. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగరవాసులు వణికిపోతున్నారు.

Also Read: మరోసారి బుడమేరు డేంజర్ బెల్స్ మోగిస్తోంది

ఇదిలా ఉండగా, బుధవారం తూర్పుగోదావరి, కాకినాడ, వైఎస్సార్, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూల్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

Related News

Trolling On Jagan: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!

Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్.. జేసీపై ఎస్పీ ప్లాన్ ఏంటి?

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. బైకర్ శివ‌శంకర్ మృతిపై సోదరుడు షాకింగ్ కామెంట్స్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రయాణికుల జాబితా.. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు కాల్ చేయండి

Bhimavaram: ఆర్ఆర్ఆర్‌పై జనసేన ఆగ్రహం.. అంత తొందర ఎందుకో?

Jagan Sharmila: షర్మిలాను చూసైనా జగన్ నేర్చుకుంటారా? వైసీపీలో కొత్త టాపిక్ ఇదే!

Kurnool Bus Accident: కర్నూల్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Big Stories

×