E-Paper
Advertisement

Asia Cup 2025: టీమిండియా ప్లేయ‌ర్లు టెర్ర‌రిస్టులు…అందుకే ట్రోఫీ ఇవ్వ‌లేదు..!

Asia Cup 2025: టీమిండియా ప్లేయ‌ర్లు టెర్ర‌రిస్టులు…అందుకే ట్రోఫీ ఇవ్వ‌లేదు..!
Advertisement

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌ ( Asia Cup 2025 Trophy ) ఛాంపియన్ గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. తొమ్మిదో సారి టైటిల్ గెలిచిన టీమిండియా, మొన్న టైటిల్ మాత్రం తీసుకోకుండానే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది. పాకిస్తాన్ దేశానికి చెందిన మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో టైటిల్ టీమిండియా తీసుకోలేదు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో టైటిల్ తీసుకోకుండానే ఇండియాకు వ‌చ్చేసింది సూర్య సేన‌.

Also Read: PSL-Multan Sultans: PCBలో ప్ర‌కంప‌న‌లు..ముల్తాన్ సుల్తాన్స్ పై నఖ్వీ కుట్ర‌లు..PSL టోర్న‌మెంటే ర‌ద్దు?

భారత ప్లేయర్లపై పాకిస్తాన్ నేత చిల్లర వ్యాఖ్యలు

Advertisement

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టైటిల్ టీమిండియా తీసుకోకపోవడం పై పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు ఉగ్రవాదులు అంటూ పాకిస్తాన్ లోని సింధ్ గవర్నర్ కమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆసియా కప్ 2025 ట్రోఫీని అందజేసేందుకు ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఓపికగా ఎదురు చూశారని, కానీ ఫైనల్ రోజు టీమిండియా ప్లేయర్లే రాలేదని మండిపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి మొహ్సిన్ నఖ్వీ, వెళ్లిపోయాక ట్రోఫీని తీసుకుందామని టీమిండియా ప్లేయర్లు అనుకున్నట్లు వెల్లడించారు.

కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం చాలా తెలివికలవాడు.. అందులోనూ మన పాకిస్తానోడు.. వాళ్లను అస్సలు నమ్మలేదు.. అందుకే అక్కడ నుంచి ట్రోఫీని తనతో తీసుకువెళ్లాడు అని కామెంట్స్ చేశారు. టీమిండియా ప్లేయర్లను టెర్రరిస్టుల లాగా నాకు హ్యాండిల్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇస్తామన్నప్పుడు తీసుకోలేదు కానీ… ఇప్పుడు ట్రోఫీ కోసం మొహ్సిన్ నఖ్వీ వెంట పడుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో మొహ్సిన్ నఖ్వీ పక్కనే ఉండి, పగలబడి నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాల్సి ఉంది. అటు ఆ పాక్ నేత వ్యాఖ్యాల‌పై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ చాలా సీరియ‌స్ అవుతున్నారు. వాడిని ఉరి తీయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఆసియా కప్ విజేతగా టీమిండియా

Advertisement

సెప్టెంబర్ మాసంలో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్ కు టీమిండియా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లోనే వెళ్ళింది. అయితే అద్భుతంగా రాణించిన టీమిండియా తొమ్మిదో సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరిగింది. ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విజయం సాధించి టైటిల్ ఎగరేసుకు వెళ్లింది.

Also Read: IND VS AUS, 2ND ODI: కొంప‌ముంచిన సిరాజ్ ఫీల్డింగ్..17 ఏళ్ల త‌ర్వాత టీమిండియా ఓట‌మి…సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×