E-Paper
Advertisement

Venkatesh Road Show @ Kaikaluru: కైకలూరులో వెంకటేష్ ప్రచారం.. తనదైనశైలిలో సినీ డైలాగ్స్‌తో..

Venkatesh Road Show @ Kaikaluru: కైకలూరులో వెంకటేష్ ప్రచారం.. తనదైనశైలిలో సినీ డైలాగ్స్‌తో..
Advertisement

Victory Venkatesh Road Show at Kaikaluru Road Show: తెలుగురాష్ట్రాల్లో బంధువుల తరపున టాలీవుడ్ నటుడు, హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాడు. ఇప్పటికే ఖమ్మంలో వియ్యంకుడి తరపున ప్రచారం చేశాడు. అక్కడి ప్రజల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నేరుగా ఆంధ్రపదేశ్‌లోని కైకలూరుకి వచ్చారు. అక్కడ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తరపున ప్రచారం చేశాడు.

ఏలూరు జిల్లా కలిదిండిలో బుధవారం సాయంత్ర రోడ్ షోలో పాల్గొన్న వెంకటేష్, తొలుత చేయి ఊపాడు. ఎన్డీయే ఆఫీసు నుంచి పడమటిపాలెం, ఎస్ఆర్పీ ఆగ్రహారం, సానారుద్రవరం, కోరుకొల్లు మీదగా రోడ్ షో సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల ఉత్సాహం గమనించి మైక్‌ని చేతులోకి తీసుకున్నాడు.

Advertisement

గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్..  శ్రీను మావయ్య మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తారని చెప్పుకొచ్చాడు. వెంకీ మామగానే కాకుండా, పెళ్లికాని ప్రసాద్‌గా.. అమాయక చంటిగా కోరుతున్నారని వ్యాఖ్యానించారు. కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్జీతో గెలిపించాలని ఓటర్లను కోరాడు. ఈనెల 13న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నాడు.

Also Read: ఏపీలో నోట్ల కట్టలు, అర్థరాత్రి 8 కోట్లు.. మెషిన్లతో కౌంటింగ్

Advertisement

నార్మల్‌గా అయితే వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే సాధారణంగా ఆయన బయటకు కనిపించడు. ఎప్పుడో సినీ, మ్యారేజ్ పంక్షన్లకు మాత్రమే దర్శనమిస్తాడు. గతంలో వెంకీ తండ్రి రామానాయుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం చేశాడు. ఆ తర్వాత కైకలూరులో మాత్రమే వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో కనిపించాడు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×