E-Paper
Advertisement

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి
Advertisement

Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు.

సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నానని విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. నారాయణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణ వయస్సు 65 ఏళ్లు దాటిందని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×