E-Paper
Advertisement

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి
Advertisement

Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు.

సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నానని విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. నారాయణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణ వయస్సు 65 ఏళ్లు దాటిందని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×