E-Paper
Advertisement

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఏపీలో గత 4 రోజులగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలపై సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది.

సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 8 నాటికి నైరుతి రుతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఆదివారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. పని ప్రదేశాలు, ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×