BigTV English

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఏపీలో గత 4 రోజులగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలపై సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది.


సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ గరిష్ఠంగా 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 8 నాటికి నైరుతి రుతుపవనాలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండల ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం 213 మండలాల్లో, మంగళవారం 285 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఆదివారం 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. పని ప్రదేశాలు, ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.


Related News

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

AP Government Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా?

Big Stories

×