BigTV English
Advertisement

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ కలకలం.. రంగంలోకి హోంమంత్రి అనిత

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ కలకలం.. రంగంలోకి హోంమంత్రి అనిత

Home Minister Anitha: విశాఖ సెంట్రల్ జైలు భద్రత, కదలికలపై వస్తున్న ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లోని బ్యారెక్స్ ఫై జైలు సూపరిండెంట్ మహేష్ బాబు తనిఖీలు చేపట్టారు. జైల్లోని అన్ని బ్లాక్ లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి తనిఖీలు చేయడంతో మూడు సెల్ ఫోన్లు, ఒక్క సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం విశాఖ మాజీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కుమార్ డైరెక్ట్ లో దొరికిన రెండు సెల్ ఫోన్లు, బ్యాటరీ, రెండు డేటా కేబుళ్ళు. నిన్న నర్మదా బ్లాక్ లో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.


నర్మదా బ్లాక్ లోని గదిలో ఫ్లోర్ ని తవ్వేసి మార్బుల్ అమర్చినట్లు సూపరిండెంట్ గుర్తించారు. నర్మదా బ్లాక్ లో ఉంటున్న గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీపై అనుమానాలు ఉన్నాయన్నారు జైలు అధికారి. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉన్న లోపలికి వెళ్తున్న సెల్ ఫోన్లపై అనుమానం వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది సెల్ ఫోన్ లను లోపలికి తీసుకువెళ్లి ఖైదీలకు ఇస్తున్నారనే అనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైదీలకు సహకరిస్తున్నారనే అనుమానంతో వార్డర్ ల దుస్తులు విప్పి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. జైలు ముందు జైలు సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో 37 మందిని జైలు అధికారులు బదిలీ చేశారు. జైలులో ఇంకా తనిఖీలు చేస్తామని సూపరిండెంట్ మహేష్ బాబు తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ మధ్య విశాఖ సెంట్రల్ జైలు చుట్టూ వరుస వివాదాలు నెలకొన్నాయి. దీంతో నేరుగా తానే రంగంలోకి దిగారు అనిత. వరుస తనిఖీల్లో ఖైదీల వద్ద సెల్‌ఫోన్స్‌ దొరకడం.. వారం క్రితం జైలు సిబ్బంది కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడం.. ఉన్నతాధికారులు వేధించారని ఆరోపణలు రావడం.. ఇలా అనేక ఘటనలు జరగడంతో నేరుగా హోంమంత్రి రంగంలోకి దిగారు.


Also Read: బయటపడ్డ భూమన గ్యాంగ్.. దందా లెక్కలు

ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ డీజీ విచారణ జరిపారు. తప్పు ఎవరిదన్న కోణంలో ఆయన విచారణ జరిగింది. ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత విశాఖ సెంట్రల్ జైలులో 37 మంది వార్డర్లపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. మరోవైపు జైలు బ్యారెక్స్‌లో మూడు సెల్ ఫోన్లు, ఒక సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్ దొరికాయి. దీంతో మరోసారి విశాఖ సెంట్రల్‌ జైలు వివాదంలో చిక్కుకున్నట్టైంది.

ఈ సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ..  విశాఖ సెంట్రల్ జైల్‌లో గంజాయి మొక్క తాను చూశానంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లోని ప్రతి బ్యారెక్‌ను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము పట్టించుకుంటున్నామన్నారు. జైల్లో సెల్ ఫోన్ దొరకడం షాకింగ్ గా ఉందన్నారు. గాంజా కూడా సప్లై చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇదంతా ఎలా జరుగుతోందో ఎంక్వైరీ చేస్తున్నామని.. ఇందులో ఎవరున్నా.. వదిలేది లేదని హోంమంత్రి హెచ్చరించారు.

 

Related News

Cyber Crime: నారా లోకేష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్.. రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. తొలి రాజకీయ అరెస్ట్, వైపీసీలో కొత్త టెన్షన్

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహరం

AB Venkateswara Rao: ఏబీవీపై.. చంద్రబాబు ప్లాన్ ఏమిటి?

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్

Pothuluri Veera Brahmendra Swamy: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 400 ఏళ్ల నాటి ఇల్లు, అరిష్టం తప్పదా?

Big Stories

×