BigTV English
Advertisement

Howrah Express: వందల ప్రాణాలు కాపాడిన ఆంధ్ర యువకుడు.. రైలుకు ఎదురెళ్లి మరీ!

Howrah Express: వందల ప్రాణాలు కాపాడిన ఆంధ్ర యువకుడు.. రైలుకు ఎదురెళ్లి మరీ!

Howrah Express: ఆ వ్యక్తి లేకుంటే ఈ సమయానికి వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ వ్యక్తే లేకుంటే భారీ ప్రాణనష్టం వాటిల్లే పరిస్థితి. ఇంతకు ఆ వ్యక్తి చేసిన పని ఏంటి? అసలేం జరిగిందో తెలుసుకుంటే.. ఆ వ్యక్తికి ఘన సన్మానాలు చేయాల్సిందే.


అహ్మదాబాద్ నుండి హౌరాకు వెళ్లే రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక్క వ్యక్తి చొరవ, సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పగా.. రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ నుండి బయలుదేరిన రైలు హౌరా కు వెళ్తూ.. గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలోని తిరుపతి జిల్లా అడవయ్య కాలనీ వద్దకు చేరే సమయం అది. ఆ సమయాన రైల్వే పట్టాల వద్దకు సునీల్ అనే వ్యక్తి వచ్చాడు. అలా వచ్చిన సునీల్ అక్కడ రైలు పట్టాలు విరిగిన విషయాన్ని గమనించాడు.

అలా గమనించిన అతను వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. అప్పుడే హౌరా ఎక్స్ ప్రెస్ వచ్చే సమయమది. వెంటనే స్థానికులను సంప్రదించి ఒక ఎర్ర తువాలును చేతిలో పట్టుకొని రైలుకు ఎదురెళ్లాడు. ఆపండి ఆపండి అంటూ కేకలు వేస్తూ.. ఎదురెళ్లగా వెంటనే రైలు లోకో పైలట్ ఈ విషయాన్ని గమనించాడు. అలా గమనించి ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, రైలును నిలిపివేశారు.


రైలు దిగి వచ్చిన లోకో పైలట్ పట్టాలు విరిగినట్లు గుర్తించి రైల్వే అధికారులకు అసలు విషయం చెప్పాడు. అధికారులు రైల్వే పట్టా విరిగిన ప్రదేశం వద్దకు చేరుకొని, పట్టాలు గమనించి సరిచేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ రైల్వే పట్టాలు విరగడంతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సునీల్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు, సునీల్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: Weather Update: మండే ఎండలు.. ఆరోజు మాత్రం మండిపోద్ది.. తస్మాత్ జాగ్రత్త

సునీల్ లేకుంటే..
రైల్వే పట్టాలు విరిగిన సమయంలో సునీల్ లేకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. రైలు పట్టాలు విరిగినట్లు గమనించడమే కాక, స్థానికులను అప్రమత్తం చేసి ఎర్రటి కండువా పట్టుకొని రైలుకు ఎదురెళ్లడం అతని సమాయస్పూర్తికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా గతంలో జరిగాయి. ఇదే తరహాలో ఏపీలోని వేటపాలెం వద్ద ఓ వ్యక్తి రైలుకు ఎదురెళ్లి లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో నాటి ఎస్పీ వకుల్ జిందాల్ సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించారు.

అదే తరహాలో సునీల్ ను రైల్వే శాఖ అభినందన కార్యక్రమం నిర్వహించి ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద సునీల్ చొరవతో హౌరా ఎక్స్ ప్రెస్ కు పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని పలువురు తెలుపుతున్నారు. రైల్వే పట్టా పనులు ముగిసిన అనంతరం యథావిధిగా రైళ్ల ప్రయాణం సాగింది.

Tags

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×