E-Paper
Advertisement

Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!

Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!
Advertisement

Toll Scam: నెల్లూరులో విచిత్ర టోల్ దోపిడి జరుగుతుంది. ఓ చెట్టుకు సిసి కెమెరాలు అమర్చి ఓ వ్యక్తి పెట్టేసాడు. అక్కడ రోడ్డు మీద వెల్లిపోయే పెద్ద పెద్ద గ్రావెల్ లారీలు ఆపి ఓక్కోదానికి 250 నుంచి 400 రూపాయలవరకు వసూలు చేస్తున్నాడు. ఎందుకు అని అడిగితే నెల్లూరు పెద్దాయన ఆర్డర్స్ ఇచ్చాడు ఇక్కడ కట్టాలని అంటాడు. అసలు ఆ నెల్లూరు పెద్దయన ఎవరూ అంటే ఆయనెవరో మాకు తెలియదు అని అంటారు. డబ్బులు కడతాము టోల్ రసీదులు ఉన్నాయా అంటే ఆయన అవి కూడా లేవంటాడు. పోనీ ఐడి కార్డులు అడిగితే బూత్ మూసేసి వెళ్లి పోతున్నాడు. ఇదంతా చూస్తుంటే గందరగోళంగా సినిమాలో బాస్ టోల్ మోసంలా ఉంది అక్కడి పరిస్థితి.

Also Read: BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

మాకు తెలియదంటున్న అధికారులు..

Advertisement

అయితే ఈ దందాపై కొందరు వ్యక్తులు స్ధానిక ఎమ్మార్వోకి తెలియ చేసారు. దీంతో ఎమ్మార్వోని అడిగితే మాకు ఆయన ఎవరో తెలియదని సమాదానం చెప్తున్నారు. ఇ దందా పై పోలీసులకు తెలియ చేస్తే వారు కూడా మాకు తెలియదని అంటున్నారు. అసలు కలెక్షన్ చేసింది ఎవరు అనేది మాత్రం అక్కడ ఎవరికి అంతు చిక్కడం లేదు. టోల్ కలెక్షన్లు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ రాకపోకలు చూస్తుంటే పక్కా ఓ పెద్దాయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అక్కడి స్థానికులు అనుకుంటున్నారు. దీంతో నిత్యం ఇలా వసూలు చేయడం వలన అక్కడి స్థానిక వాహసాదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారని దీనిపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఈ దోపిడికి అడ్డుకట్టవేయాలని అక్కడి భాదితులు వాపోయారు. నిత్యం ఈ దందాతో రాకపోకలు సాగించడం కష్టంగా మారిదని తెలిపారు.

Also Read: Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×