Toll Scam: నెల్లూరులో విచిత్ర టోల్ దోపిడి జరుగుతుంది. ఓ చెట్టుకు సిసి కెమెరాలు అమర్చి ఓ వ్యక్తి పెట్టేసాడు. అక్కడ రోడ్డు మీద వెల్లిపోయే పెద్ద పెద్ద గ్రావెల్ లారీలు ఆపి ఓక్కోదానికి 250 నుంచి 400 రూపాయలవరకు వసూలు చేస్తున్నాడు. ఎందుకు అని అడిగితే నెల్లూరు పెద్దాయన ఆర్డర్స్ ఇచ్చాడు ఇక్కడ కట్టాలని అంటాడు. అసలు ఆ నెల్లూరు పెద్దయన ఎవరూ అంటే ఆయనెవరో మాకు తెలియదు అని అంటారు. డబ్బులు కడతాము టోల్ రసీదులు ఉన్నాయా అంటే ఆయన అవి కూడా లేవంటాడు. పోనీ ఐడి కార్డులు అడిగితే బూత్ మూసేసి వెళ్లి పోతున్నాడు. ఇదంతా చూస్తుంటే గందరగోళంగా సినిమాలో బాస్ టోల్ మోసంలా ఉంది అక్కడి పరిస్థితి.
Also Read: BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు
అయితే ఈ దందాపై కొందరు వ్యక్తులు స్ధానిక ఎమ్మార్వోకి తెలియ చేసారు. దీంతో ఎమ్మార్వోని అడిగితే మాకు ఆయన ఎవరో తెలియదని సమాదానం చెప్తున్నారు. ఇ దందా పై పోలీసులకు తెలియ చేస్తే వారు కూడా మాకు తెలియదని అంటున్నారు. అసలు కలెక్షన్ చేసింది ఎవరు అనేది మాత్రం అక్కడ ఎవరికి అంతు చిక్కడం లేదు. టోల్ కలెక్షన్లు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ రాకపోకలు చూస్తుంటే పక్కా ఓ పెద్దాయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అక్కడి స్థానికులు అనుకుంటున్నారు. దీంతో నిత్యం ఇలా వసూలు చేయడం వలన అక్కడి స్థానిక వాహసాదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారని దీనిపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఈ దోపిడికి అడ్డుకట్టవేయాలని అక్కడి భాదితులు వాపోయారు. నిత్యం ఈ దందాతో రాకపోకలు సాగించడం కష్టంగా మారిదని తెలిపారు.
Also Read: Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!