E-Paper
Advertisement

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు
Advertisement

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్​యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ రావు భేటీ అయ్యారు.

పార్టీ వాయిస్ ను వినిపించడంలో..

ఈ మీటింగ్ లో పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో ఏం జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో పార్టీ వాయిస్ ను వినిపించడంలో వెనుకంజలో ఉంటున్నామని గుర్తించి.. ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతినిధులు ఎవరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెప్పకూడదని, కచ్చితంగా పార్టీ లైన్ కు అనుగుణంగానే మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఏది పడితే అది మాట్లాడి పార్టీకి ఇబ్బంది కలిగించవద్దని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

Also Read: Galaxy Forever: సగం ధరకే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్, ఫ్రీ ఈఎంఐ కూడా.. అదిరిపోయే ప్రొగ్రామ్ లాంచ్ చేసిన శాంసంగ్

త్వరలోనే నియామకాలు

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మీడియా ప్యానలిస్టులు, సెల్ కన్వీనర్ల నియామకం పూర్తయిందని, త్వరలోనే జిల్లా స్థాయి నియామకాలు కూడా పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యూహం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని మరింత సమర్థవంతంగా సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది.

Advertisement

Also Read: Harish and Sujeeth: హరీష్ గొప్పా? సుజీత్ గొప్పా?.. సుజితే గొప్పంట!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×