E-Paper
Advertisement

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచన!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని సూచన!
Advertisement

Rain alert in Telangana and AP(Today weather report telugu): తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.నేటి నుంచి ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉండటంతో చెట్ల కింద ప్రజలు ఎవరూ కూడా ఉండకూడదని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పారు.బలమైన నైరుతి రుతపవనాలకు తోడుగా,సముద్రమట్టానికి 3.1 నుండి 7.6 కి.మీ.మధ్యలో ఆవర్తన కొనసాగుతుందని వెల్లడించారు.ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం నేడు బలహీనపడుతుందన్నారు.దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Advertisement

Also Read: పీఎం కిసాన్ కొందరికేనా?

జయశంకర్‌-భూపాలపల్లి, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.గంటకు 30-40 కి.మీ వేగంతో బాలులు వీస్తాయన్నారు.పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.

Advertisement

నేడు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం పొడి వాతావరణం ఉంటుందని సాయంత్రానికి వర్షం పడే అవకాశం ఉందన్నారు.నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది.

ఇక మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో అత్యధికంగా వరపాతం నమోదు అయింది.భద్రాద్రికొత్తగూడెం,జయశంకర్‌ జిల్లాల్లో వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి. నేడు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందన్నారు.పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.గంటకు 30 నుంచి 40 కీ.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×