E-Paper
Advertisement

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!
Advertisement
AP Weather
AP Weather

Rain Alert for Andhra Pradesh State: ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబులు చెప్పింది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనాసాగుతోందని వెల్లడించింది.

ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మరో రెండు రోజుల పాటు వేడి వాతావరణం, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతోందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రానున్న రెండుమూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కడప, అనందపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.70 ఉష్ణోగ్రతలు, ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్ లో 42 డిగ్రీలు.. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: Shamanthakamani resign: వైసీపీకి గుడ్ బై.. మా వల్ల కాదు..!

Advertisement

తెలంగాణలో భిన్న పరిస్థితులు..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో సోమవారం వడగాల్పులు వీస్తే.. మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి. మంగళవారం కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మంగళవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకుల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×