BigTV English
Advertisement

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!
AP Weather
AP Weather

Rain Alert for Andhra Pradesh State: ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబులు చెప్పింది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనాసాగుతోందని వెల్లడించింది.


ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మరో రెండు రోజుల పాటు వేడి వాతావరణం, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతోందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రానున్న రెండుమూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కడప, అనందపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.70 ఉష్ణోగ్రతలు, ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్ లో 42 డిగ్రీలు.. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.


Also Read: Shamanthakamani resign: వైసీపీకి గుడ్ బై.. మా వల్ల కాదు..!

తెలంగాణలో భిన్న పరిస్థితులు..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో సోమవారం వడగాల్పులు వీస్తే.. మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి. మంగళవారం కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మంగళవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకుల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×