BigTV English
Advertisement

Jammu & Kashmir: కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. చెరో 3 సీట్లలో పోటీ..!

Jammu & Kashmir: కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. చెరో 3 సీట్లలో పోటీ..!
Congress National Conference Seat Deal In Jammu & Kashmir
Congress National Conference Seat Deal In Jammu & Kashmir

Congress National Conference Seat Deal in Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌లో మొత్తం 6 లోక్‌సభ స్థానాలుండగా చెరో 3 సీట్లలో పోటీ చేయనున్నారు.


ఒప్పందం ప్రకారం ఉధంపూర్, జమ్మూ, లడఖ్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనుండగా.. నేషనల్ కాన్ఫరెన్స్ అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్‌లలో పోటీ చేయనుంది.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా న్యూఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.


పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కాశ్మీర్‌లోని అన్ని స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

Also Read: బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ కనుమరుగైంది: కేరళ సీఎం విజయన్

ఆసక్తికరంగా, మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్-రాజౌరీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎన్‌సీ నాయకుడు మియాన్ అల్తాఫ్ అహ్మద్ కూడా అనంత్‌నాగ్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్‌సీకి చెందిన హస్నైన్ మసూది అనంతనాగ్-రాజౌరి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×