E-Paper
Advertisement

Jammu & Kashmir: కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. చెరో 3 సీట్లలో పోటీ..!

Jammu & Kashmir: కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. చెరో 3 సీట్లలో పోటీ..!
Congress National Conference Seat Deal In Jammu & Kashmir
Congress National Conference Seat Deal In Jammu & Kashmir

Congress National Conference Seat Deal in Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్ లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌లో మొత్తం 6 లోక్‌సభ స్థానాలుండగా చెరో 3 సీట్లలో పోటీ చేయనున్నారు.

ఒప్పందం ప్రకారం ఉధంపూర్, జమ్మూ, లడఖ్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనుండగా.. నేషనల్ కాన్ఫరెన్స్ అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్‌లలో పోటీ చేయనుంది.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా న్యూఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కాశ్మీర్‌లోని అన్ని స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

Also Read: బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ కనుమరుగైంది: కేరళ సీఎం విజయన్

ఆసక్తికరంగా, మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్-రాజౌరీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎన్‌సీ నాయకుడు మియాన్ అల్తాఫ్ అహ్మద్ కూడా అనంత్‌నాగ్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్‌సీకి చెందిన హస్నైన్ మసూది అనంతనాగ్-రాజౌరి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×