E-Paper
Advertisement

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చప్పట్లతో మార్మోగిన ఇస్రో

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చప్పట్లతో మార్మోగిన ఇస్రో

PSLV-C59 Launch: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం 4.12 గంటలకు నింగిలోకి నిప్పులు కక్కుతూ ప్రోబా 3 దూసుకుపోగా, ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రయోగం జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రయోగాన్ని నేటికి వాయిదా వేశారు.

ప్రోబా-3 ఉపగ్రహాన్ని నింగిలోకి నేరుగా పంపించేందుకు భారత శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సీ 59 రాకెట్ ప్రయోగంతో పంపేందుకు నేటి మధ్యాహ్నంకు సన్నాహాలు పూర్తి చేశారు. కాగా అనుకున్న విధంగా నేడు ప్రోబా 3 భూమికి అత్యంత ఎత్తులో దాదాపు 60 వేల కిలోమీటర్ల పరిధిలో నింగి కక్ష్యలోకి దూసుకుపోయింది

నిర్దేశిత కక్ష్యలో..
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రోబా..3 శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. ఐరోపా దేశానికి చెందిన 2 శాటిలైట్స్ ని ప్రోబా-3 ఉపగ్రహంలో అమర్చారు. వీటిని గగనమార్గంలో పంపారు. నిర్దేశిత కక్ష్యలోకి వీటిని ప్రవేశపెట్టి, పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుండి 30 వేల కిలోమీటర్ల ఎత్తునుండి 60 వేల కిలోమీటర్లు ఎత్తులోని గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ఈ రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.

సూర్యునిపై పరిశోధనలు
పూర్తిగా సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఈ ప్రోబాను ప్రయోగించారు. గతంలోనే భారత్ చంద్రయాన్ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో పంపించింది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ లని నింగిలోకి పంపనున్నారు భారత శాస్త్రవేత్తలు.

Also Read: Mangal Vakri 2024: అంగారకుడి తిరోగమనం.. డిసెంబర్ 7 నుంచి వీరికి అన్నీ మంచి రోజులే !

కృత్రిమ సూర్యగ్రహణం
న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో వాణిజ్యపరంగా ఉపగ్రహాలని ఇస్రో పంపుతోంది. ఇకపై సూర్యుడిపై పరిశోధనలకి ప్రోబా – 3 ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఎప్పటికప్పుడు సూర్యకిరణాలను అధ్యయం చేస్తుంది. అలాగే కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించడం, సూర్యకిరణాలని పట్టించడం వంటి ప్రయోగాలకి కీలకంగా మారనుంది ఈ ఉపగ్రహం. ఇస్రో చైర్మైన్ సోమనాధ్, శాస్త్రవేత్తల బృందం దీనిని పర్యవేకక్షించింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×