E-Paper
Advertisement

Jagan foreign tour: మంగళవారం విదేశాలకు.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్.. కాకపోతే..

Jagan foreign tour: మంగళవారం విదేశాలకు.. జగన్‌కు గ్రీన్ సిగ్నల్.. కాకపోతే..
Advertisement

Jagan foreign tour: ఎట్టకేలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది న్యాయస్థానం. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు యూకెలో ఉండనున్నారు. దీనిపై వారం రోజుల కిందట న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారాయన.

వైసీపీ అధినేత జగన్.. మరోసారి ఫారెన్ టూర్‌కు శ్రీకారం చుట్టారు. వచ్చే మంగళవారం విజయవాడ నుంచి బయలుదేరనున్నారు. ఈ ఏడాది విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల పోలింగ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండోసారి. వారం రోజుల కిందట విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా యూకె వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు బ్రిటన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే ఫారెన్ టూర్‌కు వెళ్లే ముందు టూర్ కు సంబంధించిన డీటేల్స్, ముఖ్యంగా ఫోన్ నెంబర్, ఈ మెయిన్ వంటివి న్యాయస్థానంతోపాటు సీబీఐకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Advertisement

జగన్‌కు కొత్త పాస్‌పోర్టుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. జగన్ విదేశీ టూర్‌కు అధికార పార్టీ ఏమైనా అడ్డంకులు సృష్టిస్తుందేమోనని కొంత భయపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. న్యాయ స్థానం అనుమతి ఇవ్వడంతో అందుకు ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు.

అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసు విచారణ మొదలు విదేశాలకు వెళ్లాలంటే జగన్‌తోపాటు కీలక నిందుతులంతా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కేసులో ఏ 2 విజయ సాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లనున్నారు. ఆయన కూడా అనుమతి పొందేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీఎస్ఆర్ పిటిషన్‌పై తీర్పును ఈనెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం.

న్యాయస్థానం అనుమతి ఇస్తే.. సెప్టెంబర్, అక్టోబరులో యూకె, స్వీడన్, యూఎస్ విజయ సాయిరెడ్డి వెళ్లనున్నారు. జగన్ విదేశాల్లో ఉండగానే విజయసాయిరెడ్డి వెళ్లే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లు యూకెలో జగన్‌ను వీఎస్ఆర్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎన్నికల తర్వాత జగన్.. ముఖ్యనేతలను దూరంగా పెట్టినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దేవాదాయ డిప్యూటీ కమిషనర్ వ్యవహారం.. వీఆర్ఎస్ చుట్టూ తిరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను జగన్ దూరంగా పెట్టారనే వార్తలూ లేకపోలేదు.

ఏపీలో టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జోరుగా సాగుతోంది. ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయలున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని కొన్ని విభాగాలు, జిల్లా అధ్యక్షులను సైతం జగన్ మార్చారు. కడప జిల్లా బాధ్యతలను సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఆయన కొడుకు రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గడికోట శ్రీకాంత్‌రెడ్డిని తప్పించి పార్టీలో కీలక పదవి అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అంతేకాదు అనుబంధ విభాగాలను సైతం ఈయనకే అప్పగించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×