E-Paper
Advertisement

Jagan petition: జగన్ పిటీషన్.. మూడు వారాలకు వాయిదా, హోదా మాటేంటి?

Jagan petition: జగన్ పిటీషన్.. మూడు వారాలకు వాయిదా, హోదా మాటేంటి?
Advertisement

Jagan petition: వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష‌హోదా వస్తుందా? రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? దీనివల్ల పార్టీకి ఏమి కలిసిరాదు. తన పంతం నెగ్గించుకోవడానికి మాత్రమేనని అంటున్నారు. న్యాయస్థానం ఒకవేళ ప్రతిపక్ష‌హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి వెళ్తారా? అంటే చెప్పడం కష్టమేనని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ న్యాయస్థానం తలుపుతట్టారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. రూల్ పొజిషన్ వివరాలు తన ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

మంగళవారం జగన్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. జగన్ తరపు న్యాయ వాది తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం కక్ష పూరితంగానే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని విని పించారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌‌కు లేఖ ఇచ్చారా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. గత నెల 24న స్పీకర్ లేఖ ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను వాయిదా వేసింది.

ALSO READ: షర్మిల ట్రాప్‌లో జగన్, ఎందుకు?

Advertisement

ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ గతనెలలో స్పీకర్‌కు లేఖ రాశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయనను ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా మాత్రమే గుర్తించారు. కానీ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ నోరుఎత్తలేదు. మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×