E-Paper
Advertisement

Jagan Return: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?

Jagan Return: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?
Advertisement

Jagan Return: కాలం కలిసి రాకపోతే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ పరిస్థితి కూడా అంతే. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం నుంచి పర్మీషన్ తెచ్చుకున్నా, వెళ్లలేని పరిస్థితి ఆయనది. బుధవారం తీర్పు తర్వాతైనా యూకెకు వెళ్తారా? లేదా అన్న డౌట్ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతోంది.

పాస్‌పోర్టు సమస్య వల్ల మాజీ సీఎం జగన్ యూకె టూర్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ వ్యవహారంపై బుధవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నా రు. ఈనెల ఆరున తాడేపల్లి నేరుగా బెంగుళూరు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.

Advertisement

ALSO READ: బలహీన పడిన వాయుగుండం.. ఈ జిల్లాలపై ప్రభావం ?

రీసెంట్‌గా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం జైలులో కలవనున్నారు అధినేత జగన్. ఇదే కేసులో అరెస్టయిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

బెజవాడ వరదలు, బోట్ల వ్యవహారంపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై జగన్ క్లారిటీ ఇస్తారని అంటున్నాయి. ఈ వ్యవహారంలో పార్టీకి డ్యామేజ్ బాగానే అయ్యిందని భావిస్తున్నారు జగన్. అనంతరం ఆయన యూకెకు వెళ్తారని అంటున్నాయి పార్టీ వర్గాలు. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు యూకెకు వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం నుంచి అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. పాస్‌పోర్టు సమస్య వల్ల ఏడెనిమిది రోజులైనా ఇంకా వెళ్లలేదు.

యూకె వెళ్లి వచ్చిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తున్నారట అధినేత జగన్. గత ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యనేతలుగా ఉన్నవారిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  మిగతా వారికి పార్టీ పదవులు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల మాట. చాలామందికి పార్టీ పదవులు అప్పగించారు. కొందరికి జిల్లాలు, మరికొందరిని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. టూర్ తర్వాత మిగతావి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×