YS Jagan: తాడేపల్లిలో జగన్ అద్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేంలో పలు కీలకమైన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం అని అన్నారు. వాటికోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చామిన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయిందని, ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని జగన్ ఫైర్ అయ్యారు. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుందని అన్నారు. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని అన్నారు. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు జరిగాయని, తమ వాళ్లకోసం ప్రభుత్వం జీవోలు ఇచ్చారని జగన్ పైర్ అయ్యారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దుచేశారని అన్నారు.
Also read: Ponnam Prabhakar: బోనాల జాతరలో చిందులేసిన మంత్రి పొన్నం.. వీడియో వైరల్!
సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడని, మరోవైపు రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోటల్లుడికి అప్పనంగా అప్పగించారని అన్నారు. ఇందులో ఘోరమైన అవినీతి జరిగిందని అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని జగన్ తెలిపారు.
చదరపు అడుగుకు రూ.20వేలపైనే పెడుతున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవని జగన్ పైర్ అయ్యారు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారని అన్నారు. బలవంతంగా ప్రజల భూములను లాక్కుంటున్నారుని రాష్ట్రంలో లా అండ్ ఆర్టర్ పూర్తిగా నశించిదని ఫైర్ అయ్యారు.
Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!