BigTV English
Advertisement

Jagan : జగన్ దంపతులు నిర్మల్ హృదయ్ భవన్ సందర్శన.. అనాథ పిల్లలతో ముచ్చట..

Jagan : జగన్ దంపతులు నిర్మల్ హృదయ్ భవన్ సందర్శన.. అనాథ పిల్లలతో ముచ్చట..

YS Jagan mohan reddy latest news(Andhra news today) : వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన 4 ఏళ్లు పూర్తైన వేళ.. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు. వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్వాగతం పలికారు.


మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు సీఎం జగన్ నివాళులర్పించారు. అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని అనాథ పిల్లలతో కలిసి ప్రారంభించారు. నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న పిల్లలతో సీఎం జగన్ , భారతి ముచ్చటించారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారు. జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అని సజ్జల అన్నారు. ఎన్నికలకు ముందు గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.


ప్రజలను భ్రమల్లో పెట్టి ప్రతిపక్షనేత మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారని సజ్జలు మండిపడ్డారు. కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయని సజ్జల చురకలు అంటించారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×