BigTV English

YS Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో విషాదం, అభిషేక్ ఇక లేడు

YS Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో విషాదం, అభిషేక్ ఇక లేడు

YS Abhishek Reddy: వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కొన్నాళ్లుగా బ్రెయిన్ స్టోక్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


అభిషేక్ మరణంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో కడప జిల్లా లింగాల మండల వైసీపీ అధ్యక్షుడు‌గా అభిషేక్ రెడ్డి పని చేశాడు. ఆయన మృతికి పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. అభిషేక్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు.

బుధవారం పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ రెడ్డి ఎవరో కాదు.. ఎంపీ అవినాష్‌రెడ్డికి స్వయంగా పెదనాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డికి మనవడు. డాక్టర్‌గా కొనసాగుతూనే వైసీపీ కోసం పని చేశాడు.


ప్రస్తుతం వైసీపీ డాక్టర్ల విభాగానికి కార్యదర్శిగా సేవలందించాడు. కడప జిల్లాలో అవినాష్ రెడ్డితో అభిషేక్ కీలకంగా వ్యవహరించిన వారిలో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేశారు. అప్పటికే అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందనే చర్చ లేకపోలేదు. ఈ వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.

ALSO READ:  సంక్రాంతి సెలవులపై వచ్చిన క్లారిటీ.. మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం ఎప్పుడంటే?

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×