E-Paper
Advertisement

Sankranti Holidays: సంక్రాంతి సెలవులపై వచ్చిన క్లారిటీ.. మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం ఎప్పుడంటే?

Sankranti Holidays: సంక్రాంతి సెలవులపై వచ్చిన క్లారిటీ.. మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం ఎప్పుడంటే?
Advertisement

Sankranti Holidays: సంక్రాంతి రానే వస్తోంది. సంక్రాంతి రాకతో పల్లెల్లో పండుగ శోభ కనిపించబోతోంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలలో గల ప్రజలు, తమ గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేకంగా బస్సులు రైళ్లను నడుపుతున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం జారీ చేశాయి. అయితే సంక్రాంతి సెలవులపై ఏపీ, తెలంగాణ లలో అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించాయి.

సంక్రాంతి వచ్చిందంటే చాలు పాఠశాలలకు సెలవులు మంజూరవుతాయి. పండుగ పురస్కరించుకొని విద్యార్థులందరూ ఆనందోత్సహాలతో తమ గృహాలలో సందడి చేస్తారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఏపీలో ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి పర్వదిన సెలవులను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరల 20వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఏపీలో మొత్తం 10 రోజులు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Also Read: Hyderabad Metro: మార్చి నెలాఖ‌రుకు డీపీఆర్లు పూర్తి.. భారీ జంక్షన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలో జనవరి 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను మంజూరు చేసినట్లు ఆదేశాలు వెలువడ్డాయి. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుండి 16 వరకు మాత్రమే సంక్రాంతి సెలవులను మంజూరు చేశారు. పదవ తరగతి విద్యార్థుల వరకు ఏడు రోజులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆరు రోజులుగా సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×