E-Paper
Advertisement

ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్

ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్
Advertisement

Jakkampudi Raja: కర్నూలులో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన విరుచుకుపడ్డ విధానం చూస్తుంటే, వైకాపా శ్రేణుల్లో ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.

రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లుగా మారి పనిచేస్తున్న ప్రతి పోలీస్ అధికారిపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడూ చట్టానికి లోబడి ఉండాలి.. అంతేకానీ టీడీపీ నేతలకు ఊడిగం చేస్తే మాత్రం ఊరుకోము’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రక్షక భటులే భక్షక భటులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి సీనియర్ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబు దాడులు జరిగితే, బాధితులైన వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ వేధింపులేనని కొట్టి పారేశారు. అలాగే ఒక మహిళా ఎస్సై పట్ల టీడీపీ నేతలు అమానవీయంగా ప్రవర్తిస్తే కనీసం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

ఇక కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్యపై రాజా నేరుగా నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్త బాలును అవమానించిన శేషయ్యను రేపు వైసీపీ ప్రభుత్వం రాగానే ఎవరు కాపాడతారని నిలదీశారు. ‘ఈరోజు మంత్రి భరత్ అండ చూసుకుని రెచ్చిపోతున్నావేమో.. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఇదే బాలు ఇంటి దగ్గర నువ్వు కాపలా కాయాల్సి ఉంటుంది’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో సీఐ శేషయ్య వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారని, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కార్యకర్తలను వేధిస్తున్నారని రాజా మండిపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు జగనన్న అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement

Also Read: భారీ అగ్నిప్రమాదం.. ఆసిఫ్ నగర్ ఫర్నీచర్ గోదాం దగ్ధం

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×