BigTV English

Disappointed Janasainik letter: మరీ అంత చులకనా..? పవన్ వినిపిస్తోందా? వీరి గోడు!

Disappointed Janasainik letter: మరీ అంత చులకనా..? పవన్ వినిపిస్తోందా? వీరి గోడు!

కూటమి ప్రభుత్వ హయాంలో జనసైనికులు అవమానాలు ఎదుర్కొంటున్నారా..?
పార్టీకోసం పనిచేస్తున్న నిఖార్సయిన కార్యకర్తల్ని జనసేన పట్టించుకోవడంలేదా..?
అధినేత సైలెంట్ గా ఉండటాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారా..?


ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసైనికుల ట్వీట్లు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. తాజాగా సాయిబాబా అనే జనసైనికుడి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ లేఖ వైరల్ గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి సాయిబాబా లేఖ రాశారు. తనలాగే పార్టీలో చాలామంది కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని సాయిబాబా వివరించారు. మరి ట్విట్టర్లో జనసైనికుడి ఆవేదన జనసేనాని వరకు చేరుతుందో లేదో చూడాలి.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పుకోవాలి. కానీ క్షేత్ర స్థాయిలో కూటమి అంటే టీడీపీ ప్రభుత్వం మాత్రమే అనే అర్థం ఉందని ముఖ్యంగా జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన అధికార పార్టీనా, ప్రతిపక్షమా అనేది అర్థం కావడంలేదని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించామని, ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జనసైనికుల తలరాత మారలేదని వారు ఆరోపిస్తున్నారు.

జనసేన ఎదగాలని ఉందా..?
అసలు జనసేన ఎదుగుదలను పవన్ కల్యాణ్ పట్టించుకుంటున్నారో లేదో అనే అనుమానం వస్తోందని తన లేఖలో ప్రస్తావించారు సాయిబాబా అనే జనసైనికుడు. ఇటీవల తిరువూరు నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ ను వివరణ కోరుతూ జనసేన ఒక బహిరంగ నోటీసు ఇచ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణహాని ఉందని మీడియాతో చెప్పినందుకు వివరణ కోరింది. అలాంటి వ్యవహారం ఏదైనా ఉంటే ముందు పార్టీ దృష్టికి తీసుకురావాలి కానీ, మీడియాకెక్కడం మంచిది కాదని సూచించారు నేతలు. అదే సమయంలో 48 గంటల్లోగా ఎక్స్ ప్లెనేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను కూడా సాయిబాబా పరోక్షంగా తన లేఖలో ప్రస్తావించారు. అసలు జరిగిందేంటో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే.. సదరు తిరువూరు ఇన్ చార్జ్ ని పిలిపించి మాట్లాడేవారని, కానీ బహిరంగంగా నోటీసులివ్వడం ద్వారా ఆయన్ని చులకన చేశారని అన్నారు.

అరెస్ట్ లు ఆగలేదు..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా జనసేన కార్యకర్తల అరెస్ట్ లు ఆగలేదని, అయినా కూడా పార్టీ పట్టించుకోవడంలేదని అంటున్నారు సాయిబాబా. ప్రభుత్వం కేసులు పెట్టినా తమకు పెద్దగా బాధలేదని, అయితే పార్టీ ఆఫీస్ పట్టించుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. వైసీపీ వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా జనసేన పార్టీ అధికారికంగా ఖండించడం లేదని ఆయన వాపోయారు. అదే సమయంలో కొంతమంది టీడీపీ వాళ్లు కూడా వైసీపీ వారితో చేరి పవన్ కల్యాణ్ పై లేనిపోని ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. తాను జనసేనకు, ట్విట్టర్ కి కూడా గుడ్ బై చెప్పేస్తున్నాని అన్నారు సాయిబాబా.

కార్యకర్తల్ని పట్టించుకోండి..
పార్టీని కార్యకర్తలు పట్టించుకున్నంతగా, పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా. పార్టీ బాగుంటే సరిపోదని, పార్టీలోని కార్యకర్తలు కూడా బాగుండాలని ఆయన సూచించారు. ఇన్నాళ్లూ పార్టీకోసం సిన్సియర్ గా కష్టపడ్డామని, ఆత్మాభిమానం చంపుకొని ఉండాలంటే తమ వల్ల కావడం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారయినా పవన్ కల్యాణ్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మీటింగ్ పెట్టారా అని ప్రశ్నించారు. ఇకనైనా ఆ పని చేయాలని, వారిలోని అసంతృప్తి ఏంటో తెలుసుకోవాలని సూచించారు.

సాయిబాబా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఈ లెటర్ పై సానుకూలంగా స్పందిస్తున్నారు. జనసేనలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందని, అధిష్టానం కాస్త దృష్టిపెట్టాలని వారు సూచిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×