E-Paper
Advertisement

Mudragada Padmanabham : మరోసారి ముద్రగడతో జనసేన చర్చలు.. ఆ రోజు కిర్లంపూడికి పవన్ కల్యాణ్..!

Mudragada Padmanabham : మరోసారి ముద్రగడతో జనసేన చర్చలు.. ఆ రోజు కిర్లంపూడికి పవన్ కల్యాణ్..!
Advertisement

Mudragada Padmanabham : ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో కీలక నేతలకు గాలం వేస్తున్నాయి. కుల సమీకరణాలు ఆధారంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారు.

కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన నేతలు పావులు కదిపారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ముద్రగడను కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంపిన సందేశాన్ని ఆయనకు వివరించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లడం ఆసక్తిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు దూతగానే జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ ఇంటికి వచ్చారనే చర్చ జరిగింది.

Advertisement

తాజాగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ముద్రగడను కలవడం ఆసక్తికరంగా మారింది. పవన్ నే స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారనే బొలిశెట్టి వెల్లడించారు. ఈ నెల 20 లేదా 23న ముద్రగడతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని తెలిపారు.

Related News

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

Big Stories

Advertisement
×