E-Paper
Advertisement

KA Paul on AP Liquor Bottle: కేఏ పాల్ సంచలనం.. బూమ్ బూమ్ లిక్కర్.. మీకేమో ఫారెన్, మాకేమో లోకల్!

KA Paul on AP Liquor Bottle: కేఏ పాల్ సంచలనం.. బూమ్ బూమ్ లిక్కర్.. మీకేమో ఫారెన్, మాకేమో లోకల్!
Advertisement

KA Paul Comments on Andhra Pradesh Liquor Bottles: ఆంధప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో నేతలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. కేవలం రెండు రోజులు సమయం ఉండడంతో నాలుగైదు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయంలో ముందున్నారు ప్రజాశాంతి పార్టీ చీప్ కేఏ పాల్. ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆయన కూడా అక్కడే దర్శనమిస్తున్నారు.

వేళా పాళా లేకుండా ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు కేఏ పాల్. లిక్కర్ షాపుల వద్ద మందుబాబులు వస్తారని భావించిన ఆయన, అక్కడా కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విశాఖలో ఓ వైన్ షాపు వద్ద లైనులో నిలబడి బూమ్ బూమ్ మందు బాటిల్‌ను కొనుగోలు చేశారు. అక్కడేవున్న మందు బాబులకు బాటిల్ చూపిస్తూ.. వాళ్లకేమో ఫారిన్ బ్రాండ్స్.. మాకేమో లోకల్ బ్రాండ్స్ అంటూ జగన్ సర్కార్‌ను దుయ్యబట్టారు.

Advertisement

గత ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారని, ఎక్కడంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేఏ పాల్. చీప్ లిక్కర్ అమ్ముతూ పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. రాజకీయ నేతల మాటలను అస్సలు నమ్మొద్దని చెబుతూ, తనను గెలిపిస్తే న్యాయం చేస్తానన్నారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. విశాఖ ఎంపీ, గాజువాక అభ్యర్థిగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు పాల్. అలాగే గుర్తును కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు.

Also Read: జగన్‌ను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల

Advertisement

కొనుగోలు చేసిన లిక్కర్ బాటిల్‌ను అక్కడే ధ్వంసం చేశారాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి బ్రాండ్‌లు తాగొద్దని ఓటర్లకు హితవు పలికారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేతలు పగలు ప్రచారం చేస్తుంటే, తన ప్రచారానికి ఎవరూ ఉండరని భావించారు పాల్. రాత్రి వేళ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన్ని దగ్గరుండి గమనించిన వాళ్లు మాత్రం ఆన్‌లైన్‌లో ఎన్నికల ఓటింగ్ పెడితే కేఏపాల్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని అంటున్నారు. ఆయనకు కోట్లలో ఫాలోయింగ్ ఉందని చెబుతున్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×