KA Paul: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ ఘోర ప్రమాదానికి నైతిక వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై, దాని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇచ్చిన హామీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలోని బీజేపీ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా పాల్ గుర్తుచేశారు. సొంత లాభాల కోసం కాకుండా, కార్మికుల ప్రయోజనాల కోసం కూటమి నాయకులు పనిచేయాలని, లేనిపక్షంలో ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Also Read: జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
'ప్రమాద బాధితులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలి'
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. CM చంద్రబాబు, మంత్రి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం… pic.twitter.com/5SFJnO8MYw
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2026