E-Paper
Advertisement

Kalva : కాల్వ శ్రీనివాసులు హౌస్ అరెస్ట్.. రాయదుర్గంలో ఉద్రిక్తత..

Kalva : కాల్వ శ్రీనివాసులు హౌస్ అరెస్ట్.. రాయదుర్గంలో ఉద్రిక్తత..
Advertisement

Kalva : ఏపీలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతిపక్షాల కార్యక్రమాలకు అడ్డంకిగా మారింది. ఇటీవల కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులే తలెత్తాయి.

ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్ర నిర్వహించకుండా రాయదుర్గంలోని కాల్వ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలలతోపాటు 150 మంది పోలీసులు కాల్వ నివాసం చుట్టూ మోహరించారు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

కాల్వ శ్రీనివాసులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ఆయన నివాసానికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు నిర్బంధించిన నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులు తన ఇంటి వెనుక నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు-టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోనేందుకు వెళ్లనీయకుండా తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని కాల్వ మండిపడ్డారు. అటు పోలీసులు ఇటు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో కాల్వ శ్రీనివాసులు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత పోలీసులు రోడ్లపై ర్యాలీలు, సభలకు అనుమతించడంలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

Advertisement

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×