BigTV English
Advertisement

Karempudi Political Heat: భగ్గుమన్న పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ కార్యకర్తలపై దాడులు.. సీఐకి గాయాలు

Karempudi Political Heat: భగ్గుమన్న పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ కార్యకర్తలపై దాడులు.. సీఐకి గాయాలు

Karempudi Political Heat: మరోసారి పల్నాడు ఫ్యాక్షన్ భగ్గుమంది. గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి దిగాయి. అంతేకాకుండా టీడీపీ ఆఫీసులోని ఫర్నీచర్ తో పాటు రెండు దుకాణాలను ధ్వంసం చేశాయి.


దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సీఐకి గాయాలయ్యాయి. దీంతో కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఇంతటితో ఆగకండా టీడీపీ నేత జానీబాషా వాహనానికి నిప్పుపెట్టారు వైసీపీ మూకలు.

వైసీపీ శ్రేణులు తెలుగు దేశం పార్టీ కార్యాలయం పక్కన ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతో చిరువ్యాపారులు లబొదిబొమంటున్నారు. రాజకీయాలకు తమ వ్యాపారాన్ని, తమ ఉపాధిని ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.


దీంతో మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ బింధు మాధవ్ బిందు మాధవ్ హింసను సహించేది లేదని తేల్చి చెప్పారు.

Also Read: తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి.. ఎస్పీ సీరియస్

మాచర్లకు అదనపు పోలీస్ బలగాలు పంపుతుతన్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Related News

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Big Stories

×