E-Paper
Advertisement

TTD Board Meeting : టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పాలక మండలి కీలక నిర్ణయాలు..

TTD Board Meeting : టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పాలక మండలి కీలక నిర్ణయాలు..
Advertisement

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందిని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. తిరుమల ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించింది.

అలిపిరి గోశాలలో శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి రాంనగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు కేటాయించింది. మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించింది.

Advertisement

టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇవ్వాలని తీర్మాణించింది. టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థలం కేటాయించే ప్రాంతాల్లో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించనుంది.రూ.15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ఇవ్వాలని నిర్ణయించింది.

తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో నూతన టీబీవార్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. స్వీమ్స్ లో రోగుల విశ్రాంతి భవనానికి నిధులు కేటాయించింది.స్వీమ్స్ లో వైద్య సదుపాయాలు పెంపునకు నిర్ణయం తీసుకుంది. కార్డియో నూతన భవనం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు రూ. 197 కోట్లు కేటాయించింది. తిరుపతి డీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త కెమెరాలు, బోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మించాలని నిర్ణయించింది. సాంప్రదాయ కళల అభివృద్ధికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని తీర్మానించింది. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×