E-Paper
Advertisement

ONGC Gas Leak: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం.. ఇరుసుమండలో కొనసాగుతున్న హైటెన్షన్!

ONGC Gas Leak: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం.. ఇరుసుమండలో కొనసాగుతున్న హైటెన్షన్!
Advertisement

ONGC Gas Leak: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గంటలు గడుస్తున్నా మంటల తీవ్రత మాత్రం  తగ్గకపోవడం లేదు. దీంతో  స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్ముతుంది.

ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి రంగంలోకి దిగింది RCMT ఇంచార్జ్ శ్రీహరి నేతృత్వంలోని నిపుణుల బృందం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా రెండు లారీల్లో కూలెంట్ ఆయిల్ను అధికారులు అక్కడికి తరలించారు. ప్రస్తుతం నీటితో పాటు మట్టిని ప్రయోగిస్తూ మంటల తీవ్రతను తగ్గించేందుకు శ్రమిస్తున్నారు.

Advertisement

అయితే, ఈ బ్లోఅవుట్‌ను ఎప్పటిలోగా పూర్తిగా అదుపు చేస్తారు అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గాలి దిశను బట్టి మంటలు పక్కనే ఉన్న తోటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

భావనకోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ONGC బ్లోఅవుట్ ఘటనలో ఎవరు అనారోగ్యానికి గురి కాలేదన్నారు డాక్టర్ భావన. ముందస్తుగానే అందరూ పునరావాస కేంద్రాలకు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. చిన్న శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకి మాత్రమే అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంకా కొనసాగుతుడటంతో.. ప్రజలందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.

Advertisement

ALSO READ: Yadadri District: కన్నప్రేమ కరువై.. ఆలయ మెట్లపై పసికందు విలవిల!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×