ONGC Gas Leak: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గంటలు గడుస్తున్నా మంటల తీవ్రత మాత్రం తగ్గకపోవడం లేదు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్ముతుంది.
ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి రంగంలోకి దిగింది RCMT ఇంచార్జ్ శ్రీహరి నేతృత్వంలోని నిపుణుల బృందం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా రెండు లారీల్లో కూలెంట్ ఆయిల్ను అధికారులు అక్కడికి తరలించారు. ప్రస్తుతం నీటితో పాటు మట్టిని ప్రయోగిస్తూ మంటల తీవ్రతను తగ్గించేందుకు శ్రమిస్తున్నారు.
అయితే, ఈ బ్లోఅవుట్ను ఎప్పటిలోగా పూర్తిగా అదుపు చేస్తారు అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గాలి దిశను బట్టి మంటలు పక్కనే ఉన్న తోటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
భావనకోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ONGC బ్లోఅవుట్ ఘటనలో ఎవరు అనారోగ్యానికి గురి కాలేదన్నారు డాక్టర్ భావన. ముందస్తుగానే అందరూ పునరావాస కేంద్రాలకు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. చిన్న శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకి మాత్రమే అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంకా కొనసాగుతుడటంతో.. ప్రజలందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.
ALSO READ: Yadadri District: కన్నప్రేమ కరువై.. ఆలయ మెట్లపై పసికందు విలవిల!
ఇరుసుమండలో ఊహించని పరిణామం
మళ్లీ పెరుగుతోన్న మంటలు తీవ్రత
తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగిన బ్లోఅవుట్
గత 30 నిమిషాల నుంచి మళ్లీ పెరిగిన బ్లోఅవుట్
కొనసాగుతున్న వాటర్ స్ప్రింక్లింగ్ విధానం
ONGC రిగ్గులోని చమురు అయిపోయేవరకు బ్లోఅవుట్ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్న… https://t.co/7PCFPG4Lgx pic.twitter.com/HNCA8yQSTB
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026