E-Paper
Advertisement

Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. వరుడు రెడీ కానీ.. ప్రియుడు ఎంటర్.. ఆ తర్వాత జరిగింది ఇదే!

Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. వరుడు రెడీ కానీ.. ప్రియుడు ఎంటర్.. ఆ తర్వాత జరిగింది ఇదే!
Advertisement

Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. పెళ్లి పందిరి తోరణాలతో కళకళలాడుతోంది. అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు. పెళ్లి కొడుకు కూడా సాంప్రదాయ వస్త్రధారణతో సిద్ధమవుతున్నాడు. అప్పుడే పిడుగులాంటి వార్త వినిపించింది అందరికీ. పెళ్ళి కుమార్తె కనిపించడం లేదంటూ.. కేకలు. ఇక అంతే పెళ్లి ఏర్పాట్లలో ఉన్న వారందరూ గుమికూడారు. ఇదేదో సినిమా సీన్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సీన్స్ సినిమాలలో మనకు కనిపిస్తుంటాయి. ఇదే తరహా సీన్ నిజజీవితంలో కూడా సేమ్ టు సేమ్ జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా కర్నూల్ జిల్లా పత్తికొండలో…

కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో కొన్ని గంటల వ్యవధిలోనే జరగవలసిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణం వధువు, తను ప్రేమించిన ప్రేమికుడితో పరారీ కావడమే. అనంతపురం కు చెందిన యువతిని, కృష్ణగిరి మండలం లక్కసాగరం కు చెందిన యువకుడితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి జరగాల్సి ఉండగా, సాంప్రదాయం ప్రకారం పురోహితులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇరువైపులా బంధువులు వివాహానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించేందుకు ఆశీనులయ్యారు. ఆ క్రమంలోనే కళ్యాణ వేదిక నుండి వధువు అదృశ్యమైంది. గంటల వ్యవధిలో జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది.

Advertisement

దీనితో తమ కుమార్తె అదృశ్యమైందని, వధువు తండ్రి పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కళ్యాణ మండపం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వధువు ప్రేమించిన అబ్బాయి కళ్యాణ మండపం వద్దకు వచ్చి, బైక్ పై వధువును తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గంటల వ్యవధిలో జరగాల్సిన పెళ్లికి, వధువు అదృశ్యం కావడంతో వరుడి కుటుంబ సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వధువు తల్లిదండ్రులు మాత్రం తమ పరువు గంగపాలైందని తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

Advertisement

వధువు వివాహం నిశ్చయం కాకమునుపే, తన తల్లిదండ్రులతో అసలు విషయాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు అందరిలో నవ్వుల పాలయ్యామని వధువు తరుపు బంధువులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం సీసీ కెమెరాలో నమోదైన వీడియోల ఆధారంగా, సదరు యువకుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×