E-Paper
Advertisement

AP Congress: ఏపీలో యాక్టివ్ అవుతోన్న కాంగ్రెస్.. ఐదుగురు వైసీపీ నేతలు జంప్ ?

AP Congress: ఏపీలో యాక్టివ్ అవుతోన్న కాంగ్రెస్.. ఐదుగురు వైసీపీ నేతలు జంప్ ?
Advertisement

AP Congress: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతోంది. షర్మిల చేరికతో మాజీ కాంగ్రెస్ నేతలు.. మళ్లీ సొంతగూటికి చేరాలని చూస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలు, రాష్ట్ర విభజన తర్వాత స్తబ్ధుగా ఉన్న మరికొంత మంది నేతలను ఆకర్షించడానికి కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కొణతాలతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరిగింది.

షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిత తర్వాత పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావించిన కొణతాల.. ఈరోజో.. రేపో చేరనున్నారు. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగిన కొణతాల.. రాష్ట్ర విభజన తర్వాత సైలంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ ను కూడా కలిశారు. కానీ వైసీపీలో చేరలేదు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకునే పరిణామాలు కనిపిస్తుండటంతో.. ఆయన సొంత గూటికి వెళ్లడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మాజీ మంత్రులు హస్తం కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

ఇక వైసీపీలో అసంతృప్త నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వైసీపీకి గుడ్ బై చెబుతున్న వారిలో మెజారిటీ నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో పార్టీలో చేరడానికి వారు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నాని తెలుస్తోంది.

.

Advertisement

.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×