E-Paper
Advertisement

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!
Advertisement

Machilipatnam: మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్ పేట సీఐ యేసుబాబు.. దాడికి పాల్పడిన బలరామునిపేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు.

ALSO READ: Vicarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం

Advertisement

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×