E-Paper
Advertisement

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

Machilipatnam: మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్ పేట సీఐ యేసుబాబు.. దాడికి పాల్పడిన బలరామునిపేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు.

ALSO READ: Vicarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×