Machilipatnam: మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్కు తరలించి, రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్ పేట సీఐ యేసుబాబు.. దాడికి పాల్పడిన బలరామునిపేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు.
ALSO READ: Vicarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం
మద్యం మత్తులో వీరంగం.. తాగుబోతులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
మచిలీపట్నంలోని గణేశ్ భవన్ ప్రాంతంలో మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు
పాదచరులు, సిటీ కేబుల్ ఆఫీస్ పై దాడి
యువకులను అరెస్టు చేసి సిటీ కేబుల్ ఆఫీస్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా నడిపించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన… pic.twitter.com/1KCeeqQ0hh
— ChotaNews App (@ChotaNewsApp) January 4, 2026