Vikarabad News: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పెను ప్రమాదం తప్పింది. లక్ష్మీనారాయణపురం పెట్రోల్ బంక్ సమీపంలోని.. తాండూర్ నుంచి కొడంగల్ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా భారీగా పొగలు రావడంతో.. రహదారపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కారు నుంచి రేడియేటర్, సైలెన్సర్ భాగాల నుంచి ఒక్కసారిగా పొగలు ఎడసిపడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి లోనయ్యారు.
కిషోర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొగలు గమనించిన వెంటనే అప్రమత్తమైన వారు కారు నిలిపివేసి వెంటనే బయటకు దిగారు. కారు మెుత్తం పొగతో కమ్ముకోవడంతో కొద్దిసేపు రహదారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు తమ వాహనాలను ఆపి పరిస్థితిని గమనిచడంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ సంఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి.. ప్రమాదం మరింత పెరగకుండా ముందుగా కార్ బ్యాటరీ కనెక్షన్ను తొలగించారు. దీంతో మంటలు చెలరేగే ప్రమాదం తప్పింది. కారు ఇంజెన్లో సాంకేతిక లోపం లేదా రేడియేటర్ సమస్య వల్లే పొగలు వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పెట్రోల్ బంక్ సమీసంలోనే ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు తమ వాహనాలను తరచూ తనిఖీ చేయించుకోవాలని, ముఖ్యంగా దీర్ఘ ప్రయాణాల ముందు ఇంజిన్, రేడియేటర్ వ్యవస్థలను జాగ్రత్తగా పరిశీలించాలని ఈ ప్రమాదం మరోసారి హెచ్చరికగా నిలిచింది.
ALSO READ: Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్ పూల్లో పడి..
కారు నుంచి పొగలు.. తప్పిన పెను ప్రమాదం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపురం పెట్రోల్ బంక్ సమీపంలో కారులో నుంచి అకస్మాత్తుగా వచ్చిన పొగలు
కిషోర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తాండూర్ నుంచి కొడంగల్ వెళ్తుండగా ఘటన
పొగను గమనించి కారు ఆపి దిగిపోవడంతో తప్పిన… pic.twitter.com/Lf5fbuWbD0
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2026