Divvela Madhuri: కొన్నిరోజులుగా దివ్వెల మాధురి, అప్పన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే.. దివ్వెల మాధురితో మాట్లాడిన తర్వాత అప్పన్న చిక్కుల్లో పడినట్లు టాక్ వినబడుతోంది. కాగా.. అప్పన్నను సంతబొమ్మాళి పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం అప్పన్న నరసన్నపేట సబ్జైలులో ఉన్నాడు. అయితే ఇప్పుడు సడెన్గా పాత కేసు తెరపైకి రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాడు చెట్లతాండ్రలో ఓ కుటుంబకలహాల నేపథ్యంలో.. అప్పన్నపై FIR నమోదు చేశారు. గతేడాది జూన్లో వరకట్న వే ధింపులంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా మహిళకు సంబంధించిన సెటిల్మెంట్ సమయంలో చెక్క రామారావుపై దాడి చేశాడని అప్పన్నపై అభియోగాలున్నాయి. అయితే ఈ గొడవ డిసెంబర్ 13న జరిగిందని పోలీ సులు చెబుతున్నారు. అంతేకాదు.. చెక్క రామారావు కంప్లయింట్తో అప్పన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ALSO READ: Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..