Kadapa Fire: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట పాత బస్టాండ్ సమీపంలోని శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగిన మోత్తం గది అంతా వ్యాపించాయి. దీంతో కీలక మైన ఫైళ్లు కాలి బూడిదైనట్టు సమాచారం.
అయితే ఆ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్లు అక్కడి స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ముఖ్యమైన పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు అక్కడి అధికారుల తెలిపారు. ప్రయాదంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
Also Read: ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్
దీంతో వెంటనే స్పందించిన పోలసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. దీంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రాజంపేటలో ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also read: భువనగిరి ఆర్టీఏ ఆఫీస్ వద్ద జోరుగా ఏజెంట్ల దందా.. పట్టించుకోని అధికారులు!