BigTV English

Michaung in Tirumala: భారీ వర్షాలతో భక్తుల ఇక్కట్లు.. రైళ్లు, బస్సులు రద్దు

Michaung in Tirumala: భారీ వర్షాలతో భక్తుల ఇక్కట్లు.. రైళ్లు, బస్సులు రద్దు

Michaung in Tirumala: ఏపీపై మిగ్‌జాం తుపాను విరుచుకుపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య దివిసీమ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 1977 నవంబర్ 19.. అతి భయంకరమైన తుపాను దివిసీమను తాకడంతో వచ్చిన ఉప్పెన కారణంగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ దివిసీమ వద్ద తుపాను తీరం దాటుతుందని వార్తలు రావడంతో.. ఆనాటి విషాదం మళ్లీ కళ్లముందు కదలాడుతోంది.


తిరుమలలోనూ మిగ్‌జాంప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో.. సిబ్బంది వాటిని తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణముఖి బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో.. అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరికొన్ని గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా.. అవి మొరాయిస్తున్నాయి.

ఇటు నెల్లూరులోనూ మిగ్‌జాం బీభత్సం సృష్టిస్తోంది. భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు కైవల్య నది ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జనజీవనం అస్తమవ్యస్తమైంది.


తుపాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. కుప్పం మీదుగా వెళ్లే చెన్నై, మైసూర్ మార్గంలో 4 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. డబుల్ డెక్కర్, బృందావన్ ఎక్స్ ప్రెస్, లాల్ బాగ్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి.

రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు సైతం రద్దయ్యాయి. చెన్నై – శ్రీకాళహస్తి మధ్య ఆర్టీసీ బస్సులను, తిరుపతి – కంచి మధ్య బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.

Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×