E-Paper
Advertisement

Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!

Andhra Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు.. రాబోయే ఐదు రోజుల్లో..!

Andhra Earthquake: ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయి. భూమికి 10 కి.మీ లోతులో కదలికలు చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధ్రువీకరించింది. రిక్టర్ స్కేలుపై 3.5గా ప్రకంపనల తీవ్రత నమోదైనట్లు ప్రకటించింది.

గురువారం తెల్లవారుజామున 2:35 గంటల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వినుకొండతో పాటు దర్శి దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ప్రకంపనలను ఫేస్ చేసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు నెమ్మదిగా కదిలిపోవడం చూసి ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పలువురు ఇంట్లో నుంచి బయటకు పరుగులు సైతం పెట్టినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు భూకంప కేంద్రం 46 కి.మీ దూరంలో ఉంది. అక్కడి ప్రజలు సైతం స్వల్ప ప్రకంపనలు గమనించినట్లు తెలుస్తోంది. వినుకొండ, దర్శితో పాటు మాచర్ల, పిడుగురాళ్ల, అద్దంకి, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతంలోనూ గుర్తించలేని స్థాయిలో అతి చిన్నగా కదలికలు వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Karnataka Crime: ఐదేళ్ల ప్రేమలో ఏం జరిగింది? ప్రియురాల్ని చంపి ఆపై ప్రియుడు, మరో విషయం ఏంటంటే..

కాగా, గతేడాది నవంబర్ లో విశాఖపట్నంలోనూ ఈ తరహాలో స్వల్ప భూకంపం సంభవించింది. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అల్లూరిజిల్లా జీ మాడుగల ప్రాంతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి తదితర ఏరియాల ప్రజలు ఈ భూప్రకంపనలను ఫేస్ చేశారు.

Also Read: Gundeninda GudiGantalu Today episode: శృతికి సారీ చెప్పిన రవి.. ముసలోళ్ళుగా మారిన మీనా, బాలు..రోహిణి ప్లాన్ రివర్స్..

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×