ENE2 Controversy: టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ హోదా తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఊహించని మలుపు తిరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించాల్సిన ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొదటి భాగాన్ని నిర్మించిన సురేష్ బాబు, సీక్వెల్ విషయంలో కూడా చాలా పక్కా ప్లానింగ్తో ఉన్నప్పటికీ, ఆర్థిక లెక్కలు సరిపోలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ కోట్ చేసిన భారీ రెమ్యూనరేషన్ ఈ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం.
Read also-Anchor Sravanthi : విడాకుల రూమర్స్ పై మొదటిసారి స్పందించిన స్రవంతి.. దిమ్మతిరిగే కౌంటర్..
విశ్వక్ సేన్ గత కొద్ది కాలంగా వరుస విజయాలతో తన మార్కెట్ రేంజ్ను గణనీయంగా పెంచుకున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలైనప్పటికి, ఇప్పటికి ఆయన ఇమేజ్లో చాలా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సీక్వెల్ కోసం తన కెరీర్లో అత్యధిక రెమ్యూనరేషన్ను డిమాండ్ చేశారని, అది సినిమా మొత్తం బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని సురేష్ ప్రొడక్షన్స్ భావించినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లో-బడ్జెట్ లేదా మిడ్-రేంజ్ బడ్జెట్తో గ్యారెంటీ హిట్లు కొట్టే సురేష్ బాబు, హీరో రెమ్యూనరేషన్ విషయంలో రాజీ పడలేక ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనివల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే నిర్మాణ పరమైన ఇబ్బందుల్లో పడింది.
Read also-Vijay – Rashmika: విజయ్ రష్మిక పెళ్లి కార్డు లీక్ పై టీం అసహనం.. ఆ మాత్రం తెలియదా అంటూ!
నిర్మాణ సంస్థ మారినంత మాత్రాన సినిమా ఆగిపోతుందని చెప్పలేం కానీ, #ENE2 భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ కథను మరో నిర్మాణ సంస్థకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మరో పెద్ద బ్యానర్ ముందుకు వచ్చి విశ్వక్ సేన్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడితేనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఏది ఏమైనా, ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ క్రేజీ సీక్వెల్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఈ పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ వివాదం సర్దుమణిగి, అధికారిక ప్రకటన వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.