E-Paper
Advertisement

Dharmana Prasada Rao: ‘ఎవడో కడప సుబ్బారెడ్డి.. మా భూములు దొబ్బేస్తే ఊరుకోం’: ధర్మాన

Dharmana Prasada Rao: ‘ఎవడో కడప సుబ్బారెడ్డి.. మా భూములు దొబ్బేస్తే ఊరుకోం’: ధర్మాన
Advertisement

Dharmana Prasada Rao Latest news

Dharmana Prasada Rao Latest news(AP news today telugu): ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల మీదే ఆయన గొంతు పెంచటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. నేడు మీడియాతో మాట్లాడిన ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అటు వైసీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది.

Advertisement

ప్రజాస్వామ్యంలో జనం ప్రతినిధులుగా గెలిచిన వారు పారదర్శకంగా, చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు మీడియా సమావేశంలో చెప్పారు. అవినీతికి దూరంగా, బాధ్యతాయుతంగా ఉన్న తనను వైసీపీ అధిష్ఠానం పక్కనబెట్టటం మీద ఆయన అసంతృప్తిని  వ్యక్తం చేయటమే గాక.. పార్టీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి మీద మండి పడ్డారు.

మూడున్నర దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను శ్రీకాకుళం జిల్లాకు ఎంతో మేలు చేశానని వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తనకు   తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ‘కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి మా జిల్లాలోని భూములను దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి.. శ్రీకాకుళం నీ అబ్బసొమ్ముకాదు.. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తానంటే నడవదు. వాటిని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోను. శ్రీకాకుళంలోని సహజ వనరులు కొట్టేసేందుకే ఎక్కడెక్కడి వాళ్లో వస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే.. ఇదంతా రౌడీల చేతిలోకి వెళిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోయాయి.శ్రీకాకుళం ప్రశాంతమైన ప్రాంతం. దీన్ని ఇలాగే ఉంచుతాం’అని పరోక్షంగా సుబ్బారెడ్డి మీద మండిపడ్డారు.

Advertisement

జిల్లాకు ఇంత అభివృద్ధి చేసినా మేం మీ దృష్టిలో లేకపోతే.. మీ ఇష్టం. నేను గెలిస్తే మంచిది. ఓడినా మీ స్నేహితుడిగా ఉంటా’ అని వ్యాఖ్యానించారు. నిజానికి ధర్మాన తన కుమారుడికి టికెట్ కోరాడనీ, దానికి  ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకోలేదనే వార్తలు గతంలో వచ్చాయి. అటు సీఎం సైతం ధర్మాన కుమారుడికి బదులు ఈసారికి ధర్మాన ప్రసాదరావునే పోటీచేయాలని కోరినట్లు సమాచారం. అయితే.. కొన్ని చోట్ల వారసులకు అవకాశం ఇచ్చిన సీఎం.. సీనియర్‌నైన తన కోరికను మన్నించకపోవటంతో ధర్మాన అసంతృప్తికిలోనైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైవీ సుబ్బారెడ్డి భూకబ్జాలను, అవినీతి వ్వవహారాల మీద గొంతుపెంచి మాట్లాడుతున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×