BigTV English
Advertisement

Minister Nara Lokesh: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

Minister Nara Lokesh: అదంతా సైకో వైసీపీ బ్యాచ్ పనే.. మంత్రి నారా లోకేశ్ కౌంటర్

Minister Nara Lokesh about Tanuku Anna Canteen: ఏపీలో అన్న క్యాంటీన్ నిర్వహణ సరిగ్గా లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు తణుకులోని అన్న క్యాంటీన్ నిర్వహణపై వైసీపీ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేసింది.


ఇందులో తణుకులోని అన్న క్యాంటీన్‌లో ప్లేట్లను మురుగు నీటితో కడుగుతున్నట్లు ఉంది. దీనిపై పేద ప్రజలంటే టీడీపీకి ఎందుకు ఇంత చులకన అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ ట్వీట్‌పై మంత్రి నారా లోకేశ్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.

అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డాడు. క్యాంటీన్లలో రుచితోపాటు శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వైసీపీ కావాలనే తప్పుదోవ పట్టిస్తుందన్నారు.


Also Read: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

అక్కడ స్పష్టంగా చేతులు కడిగే స్థలము అని రాసి ఉన్నా.. బురద చల్లేందుకే కొంతమంది వైసీపీ మూకలు సింకులో అన్నం తినే ప్లేట్లను పడేశారని చెప్పుకొచ్చారు. అడుగడుగునా అపరిశుభ్రమంటూ వైసీపీ వీడియో తీసి పోస్ట్ చేస్తుందని, ఇదంతా ఫేక్ ప్రచారం అని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని, పూర్తిస్థాయిలో ప్రజలకు హైజీన్ ఆహారం, ఆవరణాన్ని అందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, వైసీపీ సైకో చేస్తున్న విష ప్రచారమేనని ఆరోపించారు.

చేతులు కడిగే సింకులో అన్నం తినే ప్లేట్లను వైసీపీ మూకలు పడేస్తే.. వాటిని సిబ్బంది తీస్తున్న సమయంలో వీడియో తీసి ఆ నీటిలోనే ప్లేట్లు కడుగుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్లకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేక విష ప్రచారం చేయాలనే ఉద్దేశంతో సైకో జగన్ బ్యాచ్ ఇలా చేస్తుందని లోకేష్ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, తణుకు అన్న క్యాంటీన్ వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా స్పందించింది. ‘ప్రతి అన్న క్యాంటీన్‌లో వేడి సోప్ నీటిలో, నిత్యం తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారని, చేతులు కడుగు స్థలంలో స్పష్టంగా చేతులు కడుగు స్థలం అని రాసి ఉందని, అలా రాసిన చేతులు కడిగే స్థలంలో అన్నం తిన్న ప్లేట్లు పడేస్తే..సింక్ బ్లాక్ కావడంతోపాటు సిబ్బంది ఇబ్బంది పడుతారు. ఇలా ఆ ప్లేట్లను తీస్తున్న సమయంలో 40 సెకండ్ల పాటు వీడియో తీసి దుష్ప్రచారాని ఒడిగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామన్నారు. పరిశుభ్రతకు, నాణ్యతకు, రుచికి పెట్టింది పేరైన అన్న క్యాంటీన్ల విషయంతో ఫేక్ ప్రచారం మానవత్వం అనిపించుకోదు.’ అంటూ ట్వీట్ చేసింది.

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×